
లోక్ సభ ఆరో విడత పోలింగ్ కొనసాగుతుంది. పలువురు ప్రముఖులు ,సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించకుంటున్నారు. టీమిండియా కెప్టెన్ వీరాట్ కొహ్లీ గుర్గామ్ లోని పిన్ క్రెస్ట్ స్కూల్ లోని పోలింగ్ బూత్ లో క్యూ లైన్ లో నిలబడి ఓటు వేశాడు. బీజేపీ అభ్యర్థిగా ఢిల్లీ ఈస్ట్ లోక్ సభకు పోటీ చేస్తున్న గౌతమ్ గంభీర్ ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. మధ్యప్రదేశ్ లోని భూపాల్ బీజేపీ అభ్యర్థి ప్రగ్యా సింగ్ ఠాకూర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.