ఇవాళ చెంచులతో ప్రధాని వర్చువల్​ మీటింగ్

ఇవాళ చెంచులతో ప్రధాని వర్చువల్​ మీటింగ్

అమ్రాబాద్, వెలుగు: నల్లమల ఏజెన్సీ చెంచులతో ప్రధాని మోదీ సోమవారం లైవ్  ఇంటరాక్టివ్  ప్రోగ్రాంలో పాల్గొననున్నారు. ఇందుకోసం ఐటీడీఏ ఆధ్వర్యంలో మన్ననూరు పీటీజీ స్కూల్ లో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డీటీడీవో కమలాకర్  మాట్లాడుతూ ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రోగ్రాం ఉంటుందని, జిల్లాలోని చెంచు పెంటల నుంచి వెయ్యి మందిని ఆర్డీటీ సంస్థ ఆధ్వర్యంలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

ప్రధాని చెంచులతో మాట్లాడి సమస్యలు తెలుసుకుంటారని తెలిపారు. ఇందులోభాగంగా పలు కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు చెంచులకు వివిధ రకాల సర్టిఫికెట్లు, యూనిట్లను అందిస్తారు. ఐటీడీఏ మేనేజర్  జాఫర్, సీఐ ఆదిరెడ్డి, డీపీఎం లక్ష్మయ్య, స్టాఫ్  భరత్ పాల్గొన్నారు.