Virupaksha: బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న విరూపాక్ష

Virupaksha: బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న విరూపాక్ష

మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ విరూపాక్ష. కార్తీక్ దండు తెరకెక్కించిన ఈ మూవీకి.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ స్పైన్ థ్రిల్లింగ్ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.

విడుదలై వారం దాటినా కలెక్షన్స్ లో ఊపు మాత్రం తగ్గటం లేదు. గడిచిన ఎనిమిది రోజుల్లో ఈ సినిమా ఏకంగా 70 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి సాయిధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇక ఈ వారం అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్, మణిరత్నం PS2 వంటి పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కానీ.. ఈ రెండు సినిమాలకి ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన వచ్చింది. దీంతో.. విరూపాక్ష కలెక్షన్స్ మరోసారి ఊపందుకున్నాయి. ఈ కలెక్షన్స్ చూస్తుంటే ఈ మూవీ లాంగ్ రన్ లో 100 కోట్లు కలెక్ట్ చేయడం ఖాయమని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ని చూసి ఈ సినిమాని బాలీవుడ్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ ఈమధ్యే బాంబే కూడా వెళ్ళింది. మరి.. తెలుగులో సూపర్ హిట్ గా నిలిచినా ఈ మూవీ బాలీవుడ్ లో ఎలాంటి రెస్పాన్స్  దక్కించుకోనుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. SVCC బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాలో మళయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటించింది.