
- వెల్లడించిన ఆంటోని ఫౌచి
జెనీవా: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి మానవ సృష్టి అనడానికి ప్రూఫ్ లేదని యూఎస్ ఎపిడమాలజిస్ట్ ఆంటోనీ ఫౌచి అన్నారు. ఫౌచి అమెరికాలో కొవిడ్ – 19 కట్టడి కోసం ఏర్పాటు చేసిన కార్యదళంలో కీలక సభ్యుడు కూడా. ‘నేషనల్ జాగ్రఫీ’ చానల్కు ఇచ్చిన ఇంటరవ్యూలో ఫౌచీ ఈ కామెంట్స్ చేశారు. ఈ వైరస్ మానవ సృష్టి అనేందుకు ఎలాంటి సైంటిఫికల్ ఆధారాలు లేవని, ఫౌచి చెప్పారు. ముందు ప్రకృతిలో పుట్టిన ఈ వైరస్ క్రమంగా జీవుల్లోకి ప్రవేశించి ఉంటుందని అన్నారు. గబ్బిలాల్లో వైరస్ పరిణామక్రమాన్ని బట్టి ఈ విషయం స్పష్టమవుతుందని వివరించారు. పోయిన వారం అమెరికాకు చెందిన నిఘా వర్గాలు కూడా మానవసృష్టి అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. ఈ విషయంపై డబ్ల్యూహెచ్వో కూడా స్పష్టత ఇచ్చింది. వైరస్ వూహాన్ ల్యాబ్లో తయారు చేశారనే అమెరికా ఆరోపణలకు రుజువులు లేవని చెప్పింది. చైనా కావాలనే వైరస్ను వ్యాప్తి చేసిందని, వూహాన్ ల్యాబ్లో దాన్ని తయారు చేసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.