సినీ నటుడు విశాల్, తన తండ్రి జీకే రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. ఈ సందర్భంగా విశాల్ సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియోలో తాము కరోనా నుంచి ఎలా కోలుకున్నామో చెప్పారు. వాళ్ల నాన్న(82)కు జూన్ లో కరోనా వచ్చిందని అయితే తనను హాస్పిటల్ లో చేర్చకుండా ఇంట్లోనే ఉంచి దగ్గరుండి తన తండ్రిని చూసుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్ తనకు కూడా సోకిందని..తనతో పాటు ఉండే తన మేనేజర్ కు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పారు. అన్నింటికంటే ముఖ్యంగా కరోనా వచ్చిన వారు ఆత్మస్థైర్యంతో భయపడకుండా ఉండాలన్నారు. ఆ దైర్యమే తమను మూడు వారాల్లో పూర్తిగా కోలుకునేలా చేసిందన్నారు.
అలాగే డాక్టర్ హరీశ్ శంకర్ ఇచ్చిన ఆయుర్వేదిక్, హోమియో్పతి మందులు కూడా మాకు హెల్ప్ అయ్యాయన్నారు. ముఖ్యంగా 82 సంవత్సరాలున్న నాన్న గారికి చాలా హెల్ప్ అయిందన్నారు. నేను ఏ విదమైన ఆయుర్వేదిక్, హోమియోపతి మెడిసిన్ను ప్రమోట్ చేయడంలేదు. కేవలం ఈ మెడిసిన్ ద్వారా నేను, మానాన్న గారు, మా మేనేజర్ కోవిడ్-19 నుండి ఎలా కోలుకున్నామో మీ అందరికీ చెప్పాలన్నదే నా కోరిక అని అన్నారు ప్రముఖ హీరో విశాల్. ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను తప్ప తాను డాక్టర్స్, హాస్పిటల్స్, మెడిసిన్ వ్యవస్థకి వ్యతిరేకం కాదన్నారు. తమకు ఏ మెడిసిన్ ఉపయోగపడిందో ఆ వివరాలు తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశానన్నారు. అందరూ దైర్యంగా ఉంటే కరోనాను ఎదుుర్కోగలమన్నాడు విశాల్.