న్యూఢిల్లీ: వరల్డ్ చెస్ ఫెడరేషన్ (ఫిడే) తాత్కాలిక ప్రెసిడెంట్గా.. ఇండియా చెస్ లెజెండ్ విశ్వనాథన్ ఆనంద్ బాధ్యతలు స్వీకరించాడు. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షుడు అర్కాడీ ద్వోర్కోవిచ్పై యూరోపియన్ యూనియన్ ఆంక్షలు విధించడంతో అతను పదవి నుంచి తప్పుకున్నాడు. దాంతో 2022 నుంచి ఫిడే డిప్యూటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న విశ్వనాథన్ ఆనంద్, వ్యవస్థాపక నిబంధనల ప్రకారం తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఆంక్షల ప్రక్రియ ముగిసేవరకు లేదా ఐరోపా సమాఖ్య స్పష్టత ఇచ్చేంతవరకు ఆనంద్ ఈ పదవిలో ఉంటాడు. మరోవైపు చెస్ ఒలింపియాడ్లో ఇండియా డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగుతోంది. ఉజ్బెకిస్తాన్లో సమర్కండ్ వేదికగా సెప్టెంబర్ 16 నుంచి 27 వరకు ఈ టోర్నీ జరగనుంది.
తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి, వరల్డ్ చాంపియన్ డి. గుకేశ్, ఆర్. ప్రజ్ఞానంద, ఆర్. వైశాలి, విదిత్ గుజరాతీ, నిహల్ సరీన్, కోనేరు హంపి, దివ్య దేశ్ముఖ్, వంతిక అగర్వాల్, సవితా శ్రీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
