
రైతులను లక్షాధికారి చేస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పిండన్నారు బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లాలోని లక్షట్టిపేట మండల కేంద్రంలో నిర్వహించిన రైతు గోస బీజేపీ పోరు దీక్షలో పాల్గొన్న ఆయన.. రైతులు లేకుంటే రాష్ట్రం లేదన్నారు. రూ. 30 వేల కోట్లతో నిర్మించే కాళేశ్వరం ప్రాజెక్టును లక్ష కోట్లకు పెంచి రూ. 70 వేల కోట్లను కేసీఆర్ దోచుకున్నాడన్నారు.
రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని హామీ ఇచ్చి కేసీఆర్ మరిచిపోయిండన్నారు. మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై రైతులను దోచుకుంటుందన్నారు. ప్రధాని ఫసల్ భీమాను రాష్ట్రంలో అమలు చేయకపోవడంతో రైతులు పంట నష్ట పరిహారం కోల్పోతున్నారన్నారు. తెలంగాణ రైతులు ఆత్మహత్య చేసుకుంటే పరామర్శించని కేసీఆర్.. ఇతర రాష్ట్రాల్లో రైతు కుటుంబాలను పరామర్శించడం సిగ్గుచేటన్నారు. ప్రధాని మోడీ ఎప్పటికీ రైతులకు అండగా ఉంటాడన్నారు.