హనుమకొండ సిటీ, వెలుగు: గత శనివారం కన్నుమూసిన బీజేపీ సీనియర్ లీడర్ , మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి కుటుంబాన్ని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. సోమవారం హనుమకొండలోని జంగారెడ్డి ఇంటికి వచ్చిన ఆయన ముందుగా జంగారెడ్డి ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత జంగారెడ్డి కొడుకు సత్యపాల్ రెడ్డి, కోడలు కీర్తిరెడ్డితో మాట్లాడి ధైర్యం చెప్పారు. వెంట స్థానిక బీజేపీ లీడర్లున్నారు.
మరికొన్ని వార్తల కోసం: