చివరి బడ్జెట్‭లోనూ కేసీఆర్ మోసం జేసిండు : వివేక్ వెంకటస్వామి

చివరి బడ్జెట్‭లోనూ కేసీఆర్ మోసం జేసిండు : వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు జి. వివేక్ వెంకటస్వామి అన్నారు. చివరి బడ్జెట్‭లోనూ సీఎం కేసీఆర్ అన్ని వర్గాలను దారుణంగా మోసం చేసిండని ఫైర్ అయ్యారు. దళిత బంధు, పేదల ఇండ్ల విషయంలో కేసీఆర్ మాట తప్పారని ఆరోపించారు. పేదలకు ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. రుణమాఫీ చేస్తామని నాలుగేళ్ల పాటు రైతులను ఊరించి చివరి బడ్జెట్‭లో వెన్నుపోటు పొడిచారని వివేక్ ఆరోపించారు. ప్రజల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆశలు సన్నగిల్లాయని.. కేసీఆర్ దుకాణం బందైందని  అన్నారు. అందుకే బడ్జెట్ గురించి కాకుండా పొలిటికల్ స్పీచ్ మాత్రమే ఇచ్చారని వివేక్ వెంకటస్వామి అభిప్రాయపడ్డారు.