అవినీతిని కక్కించి.. కేసీఆర్ ను జైలుకు పంపాలి: వివేక్ వెంకటస్వామి

అవినీతిని కక్కించి.. కేసీఆర్ ను జైలుకు పంపాలి: వివేక్ వెంకటస్వామి

రాష్ట్రంలో రాక్షస పాలనను తరిమికొట్టే సమయం వచ్చిందని మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెన్నూరు ఎమ్మెల్యే అభ్యర్థి వివేక్ వెంకటస్వామి యఅన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో.. 2023, నవంబర్ 11వ తేదీ శనివారం నిర్వహించిన కాంగ్రెస్ సభలో ఆయన పాల్గొన్న మాట్లాడారు.  రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యాక రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడిందని చెప్పారు. బలహీనపడిన కాంగ్రెస్ పార్టీలో రేవంత్ జోష్ తీసుకువచ్చారని చెప్పారు. 

అన్ని విభేదాలను పక్కకు పెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పట్టుదలతో కొట్టాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉందనన్నారు. కేసీఆర్ ను గద్దె దించాలని.. కేసీఆర్ చేస్తున్న ఈ కుటుంబ పాలనను చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేసీఆర్ ను ఇంటికి పంపించాలని.. ఈ కుటుంబం చేసిన అవినీతిని కక్కించి.. జైలుకు పంపించాలని అన్నారు  కాంగ్రెస్ అధికారంలోకి రాగానే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వివేక్ తెలిపారు. 

అనంతరం బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ మాట్లాడుతూ.. సోనియా గాంధీతో తెలంగాణ ఇప్పించే ఘనత వెంకటస్వామిదేనన్నారు . పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు ఆమోదం కోసం వివేక్ కృషి చేశారని చెప్పారు. సింగరేణి సంస్థ మూతపడకుండా చూసి వేలాది మంది కార్మికులను వెంకటస్వామి ఆదుకున్నారని తెలిపారు.