పదేళ్లుగా చేయని  అభివృద్ధి ఇప్పుడు చేస్తారా..? : వొడితల ప్రణవ్

పదేళ్లుగా చేయని  అభివృద్ధి ఇప్పుడు చేస్తారా..? : వొడితల ప్రణవ్

హుజూరాబాద్, వెలుగు:  అభివృద్ధి అంటేనే  కాంగ్రెస్  అని, తమ పాలనలో దేశంతోపాటు రాష్ట్రం అన్ని రంగాల్లో డెవలప్​ అయిందని కాంగ్రెస్ అభ్యర్థి వొడితల ప్రణవ్ పేర్కొన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లోని పార్టీ ఆఫీస్​ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు.  అనంతరం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్  
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో అన్ని  హామీలు అమలు చేస్తామన్నారు.  

హుజూరాబాద్​లో తన గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.  పదేళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రూ.400కే గ్యాస్ సిలిండర్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  రూ.వేయికోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్న కౌశిక్‌రెడ్డి.. ఇన్ని రోజులు ఎవరు ఆపారని ప్రశ్నించారు. పీసీసీ మెంబర్​ పత్తి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓడిపోతున్నామని తెలిసే కౌశిక్​ రెడ్డి కొత్తగా మాట్లాడుతున్నాడని విమర్శించారు.