సాయిరెడ్డిపల్లి అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసులు

సాయిరెడ్డిపల్లి అంగన్వాడీ టీచర్కు షోకాజ్ నోటీసులు

నెక్కొండ, వెలుగు: మండల పరిధిలోని సాయిరెడ్డిపల్లి అంగన్​వాడీ టీచర్ ​సునీత ఎన్ హెచ్​టీసెస్​ యాప్​లో స్టూడెంట్స్​అటెండెన్స్​12 గంటలైనా వేయకపోవడంతో వరంగల్​ కలెక్టర్​ సత్యశారద షోకాజ్​ నోటీసులు జారీ చేశారు. బుధవారం నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లి, రెడ్లవాడ గ్రామాల్లో కలెక్టర్​ పర్యటించారు. సాయిరెడ్డిపల్లి అంగన్​వాడీ తనిఖీ చేశారు. ప్రైమరీ స్కూల్​ శిథిలావస్థకు చేరిన బిల్డింగ్​ను పరిశీలించారు.

రెడ్లవాడ ప్రైమరీని సందర్శించి, స్టూడెంట్స్​తో కలిసి భోజనం చేశారు. వారితో పాఠాలు చదివించారు. ప్రైమరీ హెల్త్​సెంటర్​ను సందర్శించి, మెడిసిన్​ నిల్వలపై ఆరా తీశారు. వానాకాలం అలర్ట్​గా ఉండాలని, మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆఫీసర్లు విధులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్​వెంట ఆర్డీవో ఉమారాణి, తహసీల్దార్​ రాజ్​కుమార్, ఎంపీడీవో ప్రవీణ్​​కుమార్​ తదితరులున్నారు.