
గ్రేటర్ వరంగల్, వెలుగు: రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన జనహిత పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా ఆదివారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో పాదయాత్ర, ప్రభాత్ పేరి, శ్రమదానం కార్యక్రమాల్లో వరంగల్ జిల్లాకు చెందిన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు మహ్మద్ఆయూబ్మాట్లాడుతూ తెలంగాణ ఇన్చార్జి ఏఐసీసీ కార్యదర్శి కుమారి మీనాక్షి నటరాజన్, రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్, మంత్రి సీతక్క, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి అజ్మాతుల్లా హుస్సేన్తో కలిసి కార్యక్రమంలో పాల్గొన్నామని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాలపై ప్రజలకు వివరిస్తున్నట్లు తెలిపారు.