
- రూ.1,100 కోట్లతో పూర్తి చేస్తమని చెప్పిన గత సర్కార్
- వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి కామెంట్స్
వరంగల్, వెలుగు : వరంగల్ సెంట్రల్ జైల్ ను కూల్చి అక్కడ నిర్మిస్తోన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో రూ.600 కోట్ల అవినీతి జరిగిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన హనుమకొండలోనిఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ప్రెస్మీట్ నిర్వహించి మాట్లాడారు. దశాబ్దాల చరిత్ర కలిగిన సెంట్రల్ జైల్ కూల్చిన కేసీఆర్ ప్రభుత్వం.. రూ.1,100 కోట్లతో ఆస్పత్రిని నిర్మిస్తామని చెప్పిందని గుర్తుచేశారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ ఆపై ఎలాంటి ప్రభుత్వ ప్రపొజల్స్, పర్మిషన్లు లేకుండానే నిర్మాణాలు చేపట్టి రూ.1,100 కోట్ల కంటే అదనంగా రూ.600 కోట్లు ఖర్చు చేసినట్లు చెబుతుండగా.. అవినీతి, అక్రమాలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
విజిలెన్స్ ఆఫీసర్లు విచారణ చేస్తుండగా.. అవినీతి వెనకాల కొందరు బీఆర్ఎస్ నేతలున్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఇందుకే ఆస్పత్రి నిర్మాణం ఆలస్యమైతున్నట్లు పేర్కొన్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చాలామంది డాక్టర్లు, సిబ్బంది పేదలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యంగా ఉంటున్నట్టు కండ్ల ముందే కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సొంతంగా ఆస్పత్రులు, క్లినిక్స్ పెట్టుకుని ఎంజీ ఎం డ్యూటీల్లో అశ్రద్ధ వహించడం సరికాదని హితవు పలికారు.
త్వరలోనే వైద్య శాఖ మంత్రి వరంగల్ లో పర్యటించి వీటన్నింటిపై సమావేశాలు, ఎంక్వైరీలు చేపట్టి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో ఏదైనా ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వ భూములు పరిశీలించే క్రమంలో ఏ ఒక్కటి అందుబాటులో లేకుండా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు ఆర్టీసీ, కుడా పరిధిలో డిమాండ్ కలిగిన భూములను ఏండ్ల తరబడి లీజుల పేరుతో జీఓలు ఇచ్చుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Warangal Super Specialty Hospital, ₹600 crore corruption, MLA Nayini Rajender Reddy, Telangana CM Revanth Reddy, hospital cost escalation, forensic audit, L&T contract, Warangal Central Jail demolition, government hospital irregularities, Telangana healthcare projects, Latest News, Telugu news, Warangal, Telangana News, V6 news