మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్

మెట్రోలో ప్రయాణించిన ప్రధాని మోడీ.. వీడియో వైరల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ మెట్రోలో ప్రయాణించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఢిల్లీ యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. మే 1, 2022న యూనివర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రారంభించిన DU శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమానికి ప్రధాన అతిథిగా ప్రధాని మోడీని ఆహ్వానించారు. ఈ క్రమంలో మోడీ మెట్రోలో ప్రయాణిస్తోన్న పలు ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. మెట్రోలో ఉన్న వీడియోల్లో ప్రధాని మోడీ మెట్రోలో సాధారణ ప్రయాణీకుడిగా కూర్చున్నట్లు కనిపిస్తోంది. మోడీ తన పక్కన కూర్చున్న వ్యక్తులతో సంభాషించడం కూడా ఈ వీడియో చూపిస్తోంది

అంతకుముందు "రేపు జూన్ 30, ఉదయం 11 గంటలకు ఢిల్లీ విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగమయ్యేందుకు ఎదురుచూస్తున్నాము. ఒక ప్రధాన అభ్యాస కేంద్రంగా, DU ఒక శతాబ్దం పాటు ప్రతిభను పెంపొందిస్తూ, మేధో వృద్ధిని ప్రోత్సహిస్తోందం"టూ మోడీ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.

https://twitter.com/ani_digital/status/1674656136136359938