సంస్కరణలతో వాటర్ బోర్డు సక్సెస్ ... సీవరేజీ, వాటర్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌కు జీఐఎస్‌‌‌‌ మార్కింగ్‌‌‌‌

సంస్కరణలతో వాటర్ బోర్డు సక్సెస్ ... సీవరేజీ, వాటర్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌కు జీఐఎస్‌‌‌‌ మార్కింగ్‌‌‌‌
  •  డ్యాష్‌‌‌‌ బోర్డు ద్వారా ఫీల్డ్‌‌‌‌వర్క్‌‌‌‌ మానిటరింగ్‌‌‌‌
  • కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌ ద్వారా ఫిర్యాదులపై దృష్టి
  • ఏడాదిలో మంచి ఫలితాలు సాధించిన ఎండీ అశోక్‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఏడాదిలో వాటర్​బోర్డులో ప్రవేశపెట్టిన వివిధ సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. సీవరేజీ, వాటర్‌‌‌‌ నెట్‌‌‌‌వర్క్‌‌‌‌కు జీఐఎస్‌‌‌‌ మ్యాపింగ్‌‌‌‌ చేసి ఫీల్డ్‌‌‌‌ వర్క్‌‌‌‌ను డ్యాష్‌‌‌‌ బోర్డు ద్వారా పర్యవేక్షించడం వల్ల అవినీతికి అడ్డుకట్ట వేసినట్టయ్యింది. 

ఏడాది క్రితం ఎండీగా బాధ్యతలు చేపట్టిన అశోక్‌‌‌‌ రెడ్డికి వాటర్​బోర్డుపై పట్టు ఉండడం కలిసివచ్చినట్టయ్యింది. గతంలో ఆయన ఈడీగా పనిచేయడం వల్ల బోర్డును మరింత బలంగా తీర్చిదిద్దడానికి పలు సంస్కరణలు ప్రవేశపెడ్తున్నారు. టెక్నాలజీని జోడిస్తూ సరికొత్త సంస్కరణలు అమలు చేస్తున్నారు. విధుల్లో చేరిన మరుసటి రోజు నుంచే ఆయన ఆకస్మిక పర్యటనలు మొదలుపెట్టారు. 

మూడు నెలల పాటు ఫీల్డ్​విజిట్లు చేసి మెయిన్​రోడ్లపై సీవరేజీ ఓవర్‌‌‌‌ ఫ్లో, లో– ప్రెషర్‌‌‌‌’ సమస్యలకు శాశ్వతంగా పులిస్టాప్‌‌‌‌ పెట్టేందుకు స్పెషల్​ప్లాన్​రూపొందించారు. కస్టమర్‌‌‌‌ కేర్‌‌‌‌కు వచ్చే ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. 

రెగ్యులర్‌‌‌‌ డ్యూటీగా సీవరేజీ స్పెషల్‌‌‌‌ డ్రైవ్

సంస్కరణలో భాగంగా మొదట సిటీలో సీవరేజీ ఓవర్‌‌‌‌ ఫ్లో కట్టడికి గతేడాది గాంధీ జయంతి సందర్భంగా 90 రోజుల సీవరేజీ స్ప్రెషల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ తోపాటు- ప్రతి ఇంటా ఇంకుడు గుంత  కార్యక్రమాలను తీసుకువచ్చి కొనసాగిస్తున్నారు. 

నగరంలో ఇప్పటి వరకు సుమారు 3,620 కిలోమీటర్ల వరకు సీవరేజీ పైప్‌‌‌‌లైన్‌‌‌‌ క్లీనింగ్‌‌‌‌తోపాటు 28,076 ప్రాంతాల్లో 2,86,132 మ్యాన్‌‌‌‌ హోళ్ల డీ సిల్టింగ్‌‌‌‌ నిర్వహించారు.  అలాగే, తన డ్యాష్‌‌‌‌ బోర్డుకు..ఆఫీసర్ల మొబైల్స్​ను కనెక్ట్​చేసి ఏ సెక్షన్‌‌‌‌ పరిధిలో ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నారు. 

మోటర్‌‌‌‌ ఫ్రీ టాప్‌‌‌‌ వాటర్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌

గత వేసవిలో తాగునీరు సరఫరాలో సమస్య లేనప్పటికీ లో–ప్రెషర్‌‌‌‌ సమస్య వేధించింది. దీంతో నల్లాలకు మోటర్లు బిగించడాన్ని కట్టడి చేసేందుకు 45 రోజుల ‘మోటర్‌‌‌‌ ఫ్రీ ట్యాప్‌‌‌‌ వాటర్‌‌‌‌ స్పెషల్‌‌‌‌ డ్రైవ్‌‌‌‌ నిర్వహించారు. నేరుగా ఫీల్డ్​విజిట్లు చేసిన ఎండీ ఎక్కడికక్కడ సీజ్​చేశారు. 

ముఖ్యంగా కమర్షియల్​బిల్డింగులపై దష్టి పెట్టి మోటర్ల సీజ్‌‌‌‌తోపాటు ఫైన్లు కూడా వేశారు. వేసవిలో నీటి సమస్య పరిష్కారానికి ఫిల్లింగ్‌‌‌‌స్టేషన్లు, ఫిల్లింగ్‌‌‌‌ పాయింట్లు, ట్యాంకర్ల సంఖ్య పెంచారు. ఆలస్యం జరగకుండా 12 నుంచి 24 గంటల్లో డెలివరీ అయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు.  

విజన్‌‌‌‌–2047 లక్ష్యంగా మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌

సీఎం ఆదేశాల మేరకు విజన్‌‌‌‌–2047 లక్ష్యంగా గ్రేటర్​హైదరాబద్‌‌‌‌ కోర్‌‌‌‌ అర్బన్‌‌‌‌ రీజియన్‌‌‌‌  కోసం సీవరేజీ, తాగునీటి ప్రాజెక్టు మాస్టర్‌‌‌‌ ప్లాన్‌‌‌‌ డీపీఆర్‌‌‌‌ రూపకల్పనకు కసరత్తు చేస్తున్నాం. ప్రజలకు డ్రైనేజీ డీ-సిల్టింగ్, తాగునీటి సరఫరాలో మెరుగైన సేవలందించడమే లక్ష్యంగా  ముందుగు సాగుతున్నాం. జీఐఎస్‌‌‌‌ మార్కింగ్‌‌‌‌తో ఫీల్డ్ వర్క్‌‌‌‌నుసైతం మానిటరింగ్‌‌‌‌ చేస్తున్నాం. కష్టపడే మా సిబ్బంది, అధికారులతోనే ఇదంతా సాధ్యమవుతున్నదని  వాటర్​బోర్డు ఎండీ  అశోక్‌‌‌‌ రెడ్డి తెలిపారు.