- 15న ప్రారంభించనున్న సింగరేణి
కోల్బెల్ట్/జైపూర్, వెలుగు: బొగ్గు తవ్వకాలు, థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న సింగరేణి తాజాగా వాటర్ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ఉత్పత్తిలోకి అడుగుపెడుతోంది. సంక్రాంతి రోజున సింగరేణిలో కొత్త వెలుగులు పంచేందుకు మంచిర్యాల జిల్లా జైపూర్సింగరేణి థర్మల్పవర్ ప్లాంట్(ఎస్టీపీపీ) వేదిక కానుంది. ఇక్కడ నిర్మించిన నీటిపై తేలియాడే ఐదు మెగావాట్ల కెపాసిటీ వాటర్ ఫ్లోటింగ్ సోలార్ప్లాంట్ను ఈ నెల15న ప్రారంభించేందుకు సింగరేణి సర్వం సిద్ధం చేసింది. థర్మల్పవర్జనరేషన్వల్ల కాలుష్యం, బూడిద నిల్వలతో పర్యావరణం దెబ్బతింటోందని సోలార్పవర్వైపు మొగ్గు చూపుతోంది. బొగ్గు ఉత్పత్తిలో 133 ఏళ్ల అపార అనుభవం కలిగిన సింగరేణి సంస్థ ఏటా 100 మిలియన్ టన్నుల టార్గెట్ వైపు దూసుకెళ్తోంది. మరోవైపు జైపూర్లోని సింగరేణి థర్మల్పవర్ప్లాంట్ద్వారా 1,200 మెగావాట్ల పవర్ను ఉత్పత్తి చేస్తూ జాతికి వెలుగులు పంచుతోంది. త్వరలో మరో 800 మెగావాట్ల ప్లాంటును ఏర్పాటు చేయనుంది. ఉన్న వనరులను వినియోగిస్తూ సింగరేణి వ్యాప్తంగా ఎనిమిది చోట్ల 219 మెగావాట్ల సోలార్ప్లాంట్లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రెండేళ్ల కాలంలో 505 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి రూ.300 కోట్లు ఆదా చేసింది.
ఎస్టీపీపీ నీళ్లపై తొలిప్రయోగం
సింగరేణి 1200 మెగావాట్ల థర్మల్పవర్ప్లాంట్లో 10 మెగావాట్ల సోలార్పవర్ఉత్పత్తి కూడా చేస్తోంది. భూమి మీద సోలార్ప్యానెళ్లు ఏర్పాటు చేసి పవర్ఉత్పత్తి చేస్తుండా తొలిసారిగా ప్రయోగాత్మకంగా జైపూర్ ఎస్టీపీపీ ఆవరణలోని రిజర్వాయర్నీళ్లపై సోలార్పవర్ఉత్పత్తికి శ్రీకారం చుట్టింది. ఎలాంటి అదనపు భూసేకరణ లేకుండా ప్లాంట్లో 365 రోజులపాటు నిశ్చలంగా ఉండే 100 ఎకరాల రిజర్వాయర్(మూడు టీఎంఎసీ) నీటిపై రెండు ఫేజ్ల్లో 15 మెగావాట్ల తేలియాడే సోలార్పవర్ప్లాంట్ఏర్పాటుకు నిర్ణయించింది. 17 ఎకరాల విస్తీర్ణంలోని నీటిపై ఫస్ట్ ఫేజ్లో 5 మెగావాట్ల ప్లాంట్నిర్మించింది. రిజర్వాయర్నీటిలో 6 మీటర్ల ఎత్తులో తెలియడేలా 20 వేల సోలార్ఫలకాలు ఏర్పాటు చేశారు. సోలార్ప్యానెళ్లు గాలికి కదలకుండా ప్లాంట్చుట్టూ 90 దిమ్మలు(పిల్లర్లు) నిర్మించారు. ఒక్కో మెగావాట్కు రూ.5.2 కోట్ల చొప్పున మొత్తంగా రూ. 26 కోట్లను వెచ్చించింది. 25 ఏళ్ల పాటు జీవితకాలం ఉండే ఈ ప్లాంట్లో దేశంలోనే తొలిసారిగా గ్లాస్ టు గ్లాస్ టెక్నాలజీ సోలార్ప్యానెళ్లు బిగించారు. హైదరాబాద్కు చెందిన సంస్థ ఈ పనులు చేసింది. పదేళ్లపాటు నిర్వహణ సైతం చేపట్టనుంది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తును జైపూర్మండలకేంద్రానికి సమీపంలోని 33/11కేవీ ఎన్పీడీసీఎల్ సబ్స్టేషన్కు అనుసంధానించనున్నారు. ఎస్టీపీపీ తర్వాత కరీంనగర్ ఎల్ఎండీ డ్యాం నీటిపై 200 మెగావాట్లు, సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మించిన మల్లన్న సాగర్రిజర్వాయర్లో రూ.1,800 కోట్ల వ్యయంతో 200 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్పవర్ ప్లాంట్లను ఏర్పాటుకు సింగరేణి సన్నాహాలు చేస్తోంది. సర్కార్నుంచి పర్మిషన్రాగానే నిర్మాణ పనులు చేపట్టనుంది.
సంకాత్రి రోజు ప్రారంభిస్తాం
ఎస్టీపీపీ రిజర్వాయర్నీటిపై ఏర్పాటు చేసిన 5 మెగావాట్ల వాటర్ ఫ్లోటింగ్సోలార్ప్లాంట్ను సంక్రాంతి రోజున ప్రారంభిస్తాం. మిగిలిన 10 మెగావాట్ల ప్లాంట్ను మార్చి నాటికి అందుబాటులోకి తీసుకువస్తాం.
– శ్రీధర్, సింగరేణి సీఎండీ