
కృష్ణానదిలో నీటి ప్రవాహం తగ్గడంతో సోమశిల(బ్యాక్ వాటర్) తీరంలో నిమజ్జనం చేసిన వినాయక విగ్రహాలు బయటపడ్డాయి. సోమశిలలోని కృష్ణానది బ్యాక్వాటర్ ఘాట్లో ఎక్కడ చూసినా వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. నిమజ్జన సమయంలో సోమశిలలో పుష్కలంగా నీరు ఉండటంతో సమీప గ్రామాలతో పాటు దూర ప్రాంతాల నుంచి తెచ్చిన వినాయకుడి విగ్రహాలను ఇక్కడే నిమజ్జనం చేశారు. శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం తగ్గడంతో సోమశిల పుష్కర ఘాట్ల వద్ద నీరు తగ్గింది. దీంతో కృష్ణానది తీరంలో వినాయక విగ్రహాలు కనిపిస్తున్నాయి. విగ్రహాలను దూరంగా తరలించి పుష్కర ఘాట్లను శుభ్రం చేయాలని పలువురు కోరుతున్నారు. సోమశిల(నాగర్కర్నూల్), వెలుగు