హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇవాళ వాటర్ ​సప్లయ్​ బంద్

హైదరాబాద్ లోని ఈ ఏరియాలో ఇవాళ వాటర్ ​సప్లయ్​ బంద్

హైదరాబాద్ సిటీ, వెలుగు : బాలాపూర్ రిజర్వాయర్ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్ వరకు జీహెచ్ఎంసీ ఎస్ఎన్డీపీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం రాత్రి వరకు రిజర్వాయర్ అవుట్ లెట్ లైన్ డైవర్షన్ చేపట్టనున్నారు. ఆ టైంలో రాజానరసింహ కాలనీ, ఇందిరానగర్, పిసల్ బండ, దర్గా బురాన్షాహి, గాజీ-మిల్లత్, జీఎం చౌని, లలితాబాగ్, ఉప్పుగూడ

డీఎంఆర్ఎల్, డీఎల్​ఆర్ఎల్, గారిసన్ ఇంజినీర్–1 & 2, డీఆర్డీఓ, మిథాని, ఒవైసీ హాస్పిటల్, బీడీఎల్, సీఆర్​పీఎఫ్ ఏరియా, కేంద్రీయ విద్యాలయం హస్నాబాద్, ఖలందానగర్, సంతోశ్​నగర్ పాత కాలనీ,  న్యూకాలనీ, యాదగిరి కమాన్ ఎదురుగా ఉన్న ఏరియా, ఎంఐజీ,హెచ్ఐజీ, ఎల్ఐజీ కాలనీలు, ఫహబా మసీదు, మారుతీ నగర్, పోచమ్మ గడ్డ, హనుమాన్ టైలర్ గల్లీ,  బాబానగర్, మక్బూల్ నగర్, జీఎం నగర్, క్వాద్రీ కాలనీ తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని వాటర్​బోర్డు అధికారులు తెలిపారు.