రూ.500 కోట్లతో చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి.. దసరా వేడుకల్లో మంత్రి వివేక్ ప్రకటన

రూ.500 కోట్లతో చెన్నూరు నియోజకవర్గ  అభివృద్ధి.. దసరా వేడుకల్లో మంత్రి వివేక్ ప్రకటన

దసరా పండుగ సందర్భంగా చెన్నూరు నియోజవర్గాన్ని సందర్శించారు కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి. గురువారం (అక్టోబర్ 02) క్యాంపు కార్యాలయంలో ఆయుధపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, చెన్నూర్ నియోజకవర్గ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. 

చెన్నూర్ నియోజకవర్గంలోనీ చెన్నూర్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో 500 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చుతోందని అన్నారు. కాంగ్రెస్ పాలన పట్ల  ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు.