నార్కో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మేం రెడీ: బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నార్కో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మేం రెడీ: బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

న్యూఢిల్లీ: లైంగిక వేధింపుల కేసులో తనతో పాటు రెజ్లర్లు కూడా నార్కో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించుకోవాలని డబ్ల్యూఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ భూషణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విసిరిన చాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్టార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెజ్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పూనియా స్వీకరించాడు. బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు నార్కో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లకు తామంతా రెడీగా ఉన్నామని సోమవారం వెల్లడించాడు.

‘మేం ఏ టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కైనా రెడీ. నార్కో, పాలిగ్రాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే సుప్రీం కోర్టు పర్యవేక్షణలో బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరీక్ష చేయించుకోవాలి. దీనిని టీవీల్లో లైవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలి. ఏం ప్రశ్నలు అడుగుతారో మేం కూడా తెలుసుకోవాలనుకుంటున్నాం. వినేష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి, నాకు నార్కో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయమని అడిగారు. మా ఇద్దరికే కాకుండా ఫిర్యాదు చేసిన అమ్మాయిలందరికీ నార్కో టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి. మా ఆరోపణలు నిజమని రుజువు చేస్తాం’ అని బజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు. తమకు జరిగిన అన్యాయాన్ని దేశం మొత్తం తెలుసుకోవాలని వినేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరింది. మీడియాలో ఓ వర్గం బ్రిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మంచివాడిగా చిత్రీకరిస్తోందని, అలా చేయడం సరైంది కాదన్నది.