రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ
న్యూఢిల్లీ: మనదేశం సాధారణ పెట్రో ప్రొడక్టుల నుంచి క్లీన్ ఎనర్జీలకు మారుతున్నందున, గ్లోబల్ ఎనర్జీ లీడర్గా ఎదిగే సత్తా ఇండియాకు ఉందని రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. ఇందుకు కొత్త టెక్నాలజీలు ఎంతో ఉపయోగపడుతాయని చెప్పారు. తగిన ప్లాన్తో ముందుకు వెళ్తే రాబోయే 20 ఏళ్లలో 50 లక్షల ట్రిలియన్ డాలర్ల విలువైన గ్రీన్ ఎనర్జీని ఎగుమతి చేసే కెపాసిటీని సాధించవచ్చని అన్నారు. తమ కంపెనీ కూడా పెద్ద ఎత్తున గ్రీన్ హైడ్రోజన్ను తయారు చేస్తుందని ప్రకటించారు. మిగతా దేశాల కంటే రిన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్ట్మెంట్లకు ఇండియాలోనే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అంబానీ పేర్కొన్నారు. అయితే ఇదంతా ఒక్క రోజులోనే జరిగే పనికాదని, 20–30 ఏళ్లు పడుతుందని చెప్పారు. పెట్రోల్, బొగ్గు వాడకాన్ని ఆపడానికి తగిన ప్లాన్రెడీ కావాలని అన్నారు. ఢిల్లీలో జరిగిన ఆసియా ఎకనామిక్ డైలాగ్మీటింగులో ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ వల్ల తక్కువ ఖర్చుతో క్లీన్ ఎనర్జీలను తయారు చేయవచ్చని అంబానీ పేర్కొన్నారు. ఇండియా క్లీన్ ఎనర్జీ మార్కెట్ లీడర్గా ఎదిగితే పెద్ద సంఖ్యలో జాబ్స్ వస్తాయని చెప్పారు.