కామారెడ్డిలో ఆత్మహత్య చేసుకున్న సంతోష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. మెదక్ జిల్లా రామాయంపేటలో సంతోష్ కుటుంబాన్ని రఘునందన్ పరామర్శించారు. సంతోష్ కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. సంతోష్ ఆత్మహత్యకు జిల్లా ఎస్పీ బాధ్యత వహించాలన్నారు .ఈ కేసులో న్యాయం జరగాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయాలన్నారు.