- చైనా విషయంలో బీజేపీపై విమర్శలు చేసిన అమరేందర్సింగ్
చండీగఢ్: చైనా అంశంలో బీజేపీ వ్యవహరిస్తున్న తీరును పంజాబ్ సీఎం అమరేందర్సింగ్ విమర్శించారు. “ మేం(కాంగ్రెస్) 1948, 65,71,99లో యుద్ధాన్ని గెలిచాం. చైనాను ఆపాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్లదే (బీజేపీ). చైనాతో 60ల నుంచి గొడవ నడుస్తూనే ఉంది. గాల్వాన్ గొడవ ఇప్పటిది కాదు. ప్రభుత్వం మిలటరీ ప్రీకాషన్స్ తీసుకుంటుందని నమ్ముతున్నాను. మనం వాళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నాను” అని అమరేందర్సింగ్ అన్నారు. కరోనాపై యుద్ధం చేసేందుకు ప్రధాని మోడీ క్రియేట్ చేసిన పీఎం– కేర్స్కు చైనా కంపెనీలు ఇచ్చిన డొనేషన్లను కూడా వెనక్కి ఇచ్చేయాలి అని అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఘటనలు జరిగి.. మన సైన్యం చనిపోయినప్పుడు వాళ్ల ఫండ్ మనకు అవసరం లేదు అని ఆయన చెప్పారు. మనం చైనా వాళ్ల డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అని చెప్పారు. ఇండియా – చైనా సరిహద్దుల్లోని గాల్వాన్లో జరిగిన ఘటనలో మన ఆర్మీకి చెందిన 20 మంది అమరులయ్యారు. దీంతో ఇండియా– చైనా మధ్య ఉద్రికత్తత నెలకొంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం టిక్టాక్ సహా 59 చైనా యాప్లపై నిషేధం విధించింది.
