
హైటెక్ యుగంలో జనాలను ఆరోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. ముఖ్యంగా అధిక బరువుతో ఇబ్బంది పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కచ్చితంగా బరువును నియంత్రించుకోవాల్సిందే. వెయిట్ లాస్ విషయంలో జస్ట్ మనం తినే ఆహారంలో స్మాల్ ఛేంజస్ చేసుకుంటే సరిపోతుందని చెబుతన్నారు. పోషకాలు.. ఫైబర్ కంటెంట్ కలిగి జీర్ణక్రియను మెరుగుపర్చే కొన్ని రకాల బియ్యంను తింటే బరువు తగ్గుతారని చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. . .
బ్రౌన్ రైస్ : ఇవి తృణ ధాన్యాలు. వీటిలోపైబర్.. విటమిన్లు ఉంటాయి. బ్రౌన్ రైస్ లో లభించే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండుతుంది. సరిపడ కేలరీలు శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా డయాబెటిస్ పేషంట్లు బ్రౌన్ రైస్ తింటే గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి. అన్నింటి కంటే ముఖ్యంగా ఈ రోజుల్లో జనాలు అధిక బరువుతో నానారకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారు బ్రౌన్ రైస్ను తింటే బరువు తగ్గుతారు.
బ్లాక్ రైస్ : ఈ బియ్యంలో యాంటీఆక్సిడెంట్లు.. ఆంథోసైనిన్లు ఉంటాయి. బ్లాక్ రైస్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఫైబర్ .. ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి. ఇవి తిన్న వారికి శరీరంలో కొవ్వు కరుగుతుంది. బరువు తగ్గడం.. జీర్ణక్రియ ఆరోగ్యం బ్లాక్ రైస్ తిన్నవారిలో మెరుగుపపడుతుందని పలు అధ్యయనాల ద్వారా తెలుస్తుంది.
ఎర్ర బియ్యం : ఫైబర్ .. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే మరొక తృణధాన్యం ఎర్రబియ్యం ..ఇవి చాలా స్లోగా జీర్ణమవుతాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంతో పాటు వీటిలో బరువును తగ్గించే లక్షణాలుంటాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి.
బాస్మతి బియ్యం : ఇవి కొద్దిగా తిన్నా సరే చాలా నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఆకలిని తగ్గించే లక్షణం బాస్మతి రైస్ లో ఉంటుంది. ఇవి ఉడికిన తరువాత చాలా రుచికరంగా ఉంటాయి. ముఖ్యంగా గోధుమ బాస్మతి బియ్యం రక్తంలో షుగర్ లెవల్స్ ను అదుపులో ఉంచేందుకు ఎంతో ఉపయోగకారిగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి తక్కువ తిన్న కడుపు ఫుల్ గా ఉండటంతో.. శరీరానికి కావలసిన శక్తిని అందించడమే కాకుండా ... ఇవి తిన్న వారు వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వైల్డ్ రైస్ : ఇది గడ్డి విత్తనం. వీటిలో తెల్ల బియ్యం కంటే తక్కువ కేలరీలు ఉండటమే కాకుండా ఎక్కువ ప్రోటీన్లు కలిగి ఉంటాయి. బరువు సమస్యలతో బాధపడే వారు వైల్డ్ రైస్ ను తింటే క్రమేణ బరువుతగ్గుతారు.