మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్​తోనే సాధ్యం : అంజన్ కుమార్ యాదవ్

మైనార్టీల సంక్షేమం కాంగ్రెస్​తోనే సాధ్యం : అంజన్ కుమార్ యాదవ్

ముషీరాబాద్, వెలుగు: మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యతనిస్తుందని ఆ పార్టీ ముషీరాబాద్ సెగ్మెంట్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. సెగ్మెంట్​లోని 32 చర్చిల ప్రతినిధులతో జాన్ కెనడీ ఆధ్వర్యంలో గోల్కొండ చౌరస్తాలోని ఎంబీ చర్చిలో బుధవారం సమావేశం నిర్వహించారు. చీఫ్​ గెస్టుగా హాజరైన అంజన్ కుమార్​ను బిషప్స్ ఆశీర్వదించారు. అనంతరం ఆయనమాట్లాడుతూ.. దేశం కోసం రాహుల్ గాంధీ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4 వేల కి.మీ భారత్ జోడో యాత్ర చేశారన్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు దేశ రాజకీయాలను మలుపు తిప్పుతుందన్నారు. ఈ నెల 30న జరిగే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ముషీరాబాద్ సెగ్మెంట్ రెడ్డి వెల్ఫేర్ సభ్యులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీనియర్ నేత అంజిరెడ్డి మాట్లాడుతూ.. ముషీరాబాద్ లో అంజన్ కుమార్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో ఏఐసీసీ వైస్ చైర్మన్ అనిల్ థామస్, డేనియల్ తదితరులు పాల్గొన్నారు.