వాట్సాప్ గ్రూప్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై వ్యతిరేకంగా కామెంట్లు చేసిన ఓ వ్యక్తి కటకటాలపాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 4న సహబుద్దీన్అన్సారీ అనే వ్యక్తి ఓ వాట్సప్ గ్రూప్ లో సీఎంను అవమానించేలా వాట్సప్ గ్రూప్ లో కామెంట్ చేశాడు.
ఈ విషయంపై పోలీసులకు కంప్లెంట్స్ అందాయి. ఇందుకు సంబంధించిన వివరాలు పొందిన అనంతరం కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అతను కామెంట్ చేసిన వాట్సప్ గ్రూప్ పేరు 'నగర్ పాలిక పరిషత్ భదోహి'. ఇందులో భదోహిలోని నగర్ పాలిక పరిషత్లోని దాదాపు అందరూ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఇది కార్పొరేటర్ల అధికారిక వాట్సాప్ గ్రూప్ కాదని పోలీసులు తెలిపారు.