హైదరాబాద్,వెలుగు: కారులో వెళ్తున్న వ్యక్తిని కత్తులతో పొడిచి చంపిన ఘటన ఓల్ట్సిటీలోని చాంద్రాయణగుట్ట పీఎస్ లిమిట్స్ బండ్లగూడ హస్మాబాద్లో జరిగింది. బార్కాస్కి చెందిన హమీద్ బిన్ జువేది(45) చాంద్రాయణగుట్టలో వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ఆఫీస్ నిర్వహిస్తున్నాడు. బుధవారం సాయంత్రం చాంద్రాయణగుట్ట నుంచి బండ్లగూడ రూట్లో అతడు కారులో వెళ్తుండగా సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నలుగురు వ్యక్తులు అడ్డుకున్నారు. బండ్లగూడ హైవే రోడ్డుపై అందరూ చూస్తుండగానే హమీద్పై కత్తులు, రాళ్లతో దాడి చేసి పారిపోయారు. స్థానికులు సమాచారం ఇవ్వగా పోలీసులు వెళ్లి హమీద్ను ఉస్మానియా హాస్పిటల్కి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితులు రాయిస్జాబ్రీ అలియాస్ రాయిస్ రుబైయా, అదిల్, సయీద్లను అరెస్ట్ చేశామని సౌత్ జోన్ డీసీపీ గజరావ్ భూపాల్ తెలిపారు. ఆర్థిక లావాదేవీలే హమీద్ మర్డర్కు కారణమని అనుమానిస్తున్నామని చెప్పారు.
వ్యక్తి దాడిలో బార్ సిబ్బందికి గాయాలు
శంషాబాద్, వెలుగు: రెస్టారెంట్ సిబ్బందిపై వ్యక్తి దాడి చేసిన ఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భవాని బార్లో చోటు చేసుకుంది. రవి అనే వ్యక్తి బుధవారం బారుకు వచ్చి తాగి బిల్ డిస్కౌంట్ కావాలని సిబ్బందితో గొడవకు దిగాడు. డిస్కౌంట్ ఇవ్వడం కుదరదని చెప్పారు. వినాయక చందా ఇవ్వలేదని మనసులో పెట్టుకున్న రవి, బార్ సిబ్బంది రామకృష్ణ, సాయిధర్గౌడ్, అనిల్ సింగ్ పై దాడి చేయగా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్కు తరలించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు రవిపై కేసు ఫైల్ చేశామని సీఐ కనకయ్య చెప్పారు.