- మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్
రామచంద్రాపురం, వెలుగు: సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్లో నిర్మాణాల వద్ద ఏర్పాటు చేసిన లేబర్ క్యాంపులపై ప్రభుత్వానికి నియంత్రణ లేదని, ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షించడం లేదని మెదక్ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.
తెల్లాపూర్నైబర్హుడ్అసోసియేషన్ప్రెసిడెంట్ రమణపై ఒక వర్గానికి చెందినవారు సోమవారం దాడి చేయడంతో సాయంత్రం ఎంపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రమణపై దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు.
ఓ వర్గానికి చెందిన కట్టడం విస్తరణ పేరుతో రోడ్డును ఆక్రమిస్తుంటే, వెళ్లి ప్రశ్నిస్తే పోలీసుల ముందే దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. రమణపై దాడి చేసిన వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని, లేదంటే భవిష్యత్పరిణామాలకు సీఎందే బాధ్యతని హెచ్చరించారు.
తెల్లాపూర్ లోని లేబర్క్యాంపులకు ఎక్కడినుంచి వస్తున్నారో తెలియని పరిస్థితి ఉందని, రోహింగ్యాలు కూడా మైగ్రేట్అయ్యే చాన్స్ ఉందని పీసీబీ, లేబర్ ఆఫీసర్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అధికారులు ఎంక్వైరీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కన్స్ర్టక్షన్ పేరుతో డిస్ర్టక్షన్ చేస్తున్న నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకోవాలన్నారు.
