ఒక ఉబర్‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌కు రూ.24 లక్షల ఛార్జీ

ఒక ఉబర్‌‌‌‌‌‌‌‌ రైడ్‌‌‌‌కు రూ.24 లక్షల ఛార్జీ

న్యూఢిల్లీ: ఉబర్ రైడ్ బుక్ చేసిన ఓ యూఎస్ కపుల్​కు చేదు అనుభం మిగిలింది.  సెంట్రల్‌‌‌‌ అమెరికాలోని గ్వాటెమాలాలో ట్రావెల్ చేస్తున్న వీరు ‌‌‌‌ రైడ్‌‌‌‌ బుక్ చేసుకోగా, ఉబర్‌‌‌‌‌‌‌‌ ఏకంగా రూ.24 లక్షలు (29,994 యూఎస్ డాలర్లు) బిల్ వేసింది.  కోస్టారికన్ కోలన్‌‌‌‌ కరెన్సీలో ఛార్జ్ చేయాల్సి ఉండగా(చేసుంటే రూ.4,500 లేదా 55 డాలర్లు అయ్యేది)  , కరెన్సీ మార్పిడిలో తప్పు వలన యూఎస్ డాలర్లలో ఉబర్ కట్ చేసుకుంది. అకౌంట్‌‌‌‌లో సరిపడ ఫండ్స్‌‌‌‌ లేకపోవడంతో ట్రాన్సాక్షన్ డిక్లయిన్‌‌‌‌ అయ్యిందని  భర్త డగ్లస్‌‌‌‌ ఆర్డోంనెజ్‌‌‌‌ పేర్కొన్నారు.

తన ఫిఫ్త్‌‌‌‌ యానివర్సరీ కోసం గ్వాటెమాలా వెళ్లామని చెప్పారు. తన అకౌంట్‌‌‌‌లోని 29 వేల డాలర్లు కట్ అయిపోయాయని, మిగిలిన ట్రిప్‌‌‌‌ను ఎంజాయ్ చేయాలకపోయామని వాపోయారు. యూఎస్ డాలర్లలో ఛార్జ్‌‌‌‌ అయ్యిందని  తర్వాతి రోజు మార్నింగ్ గుర్తించామని భార్య డొమిన్క్‌‌‌‌ ఆడమ్స్ అన్నారు. కొన్ని రోజులకు రీఫండ్ అయ్యిందని, కానీ, ఉబర్‌‌‌‌‌‌‌‌ను ఇక నుంచి  బుక్ చేసుకోమని పేర్కొన్నారు.