ఇవాళ అసెంబ్లీలో పవర్ సెక్టార్​పై శ్వేతపత్రం

ఇవాళ అసెంబ్లీలో పవర్ సెక్టార్​పై శ్వేతపత్రం

 హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర పవర్ సెక్టార్​పై గురువారం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. తెలంగాణ ఆవిర్భావానికి ముందు రాష్ట్రంలో జెన్కో, ట్రాన్స్​కో, డిస్కమ్​ల పరిస్థితి, బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో చేసిన అప్పులు, పవర్ ప్రాజెక్టుల పరిస్థితిపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ నిర్వహించనున్నారు. గురువారంతోనే అసెంబ్లీ సమావేశాలు ముగించాలనుకున్నా.. ఇరిగేషన్​పై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతున్నది. అసెంబ్లీ షెడ్యూల్​లో ఒక్క పవర్ సెక్టార్​పై షార్ట్ డిస్కషన్ ఉంటుందని ప్రకటించింది. దీంతో శుక్రవారం కూడా అసెంబ్లీ సమావేశాలు కొనసాగే అవకాశముందని తెలుస్తున్నది.