- మాస్క్విరిక్స్ వ్యాక్సిన్కు అనుమతిచ్చిన డబ్ల్యూహెచ్వో
- 3 ఆఫ్రికా దేశాల్లో ట్రయల్స్.. ఎఫికసీ 39%
న్యూఢిల్లీ: తొలి మలేరియా వ్యాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) అనుమతిచ్చింది. పిల్లల కోసం డెవలప్చేసిన ‘ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01’ టీకాను ప్రపంచవ్యాప్తంగా వాడేందుకు అనుమతి ఇస్తున్నట్టు డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్టెడ్రోస్ అథనమ్ బుధవారం తెలిపారు. మూడు ఆఫ్రికా దేశాల్లో పైలెట్గా వ్యాక్సిన్ను పరిశీలించారన్నారు. ‘మలేరియా రీసెర్చర్గా నేను కెరీర్ను స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఈ భయంకరమైన వ్యాధికి వ్యాక్సిన్ ను కనుగొనగడం చూస్తున్నాను’ అని అథనమ్చెప్పారు. ఆర్టీఎస్, ఎస్/ఏఎస్01 వ్యాక్సిన్ను మాస్క్విరిక్స్అని కూడా అంటారు. ఈ వ్యాక్సిన్ను బ్రిటిష్ ఫార్మాసూటికల్ కంపెనీ గ్లాక్సోస్మిత్క్లైన్ డెవలప్ చేసింది. 2019లో మొదలైన ట్రయల్స్లో భాగంగా ఘనా, కెన్యా, మలావి దేశాల్లోని 8 లక్షల మంది పిల్లలపై వ్యాక్సిన్ను ప్రయోగించి చూశారు. దీని ఎఫికసీ తక్కువగానే నమోదైంది. మలేరియా కేసులను 39 శాతం, తీవ్రమైన కేసులను 29 శాతం నిలువరించగలిగింది. మలేరియా వల్ల ప్రపంచవ్యాప్తంగా 2019లో 4 లక్షల మందికి పైగా మరణించారు. ఇందులో 2.7 లక్షల మందికి పైగా పిల్లలే ఉన్నారు. గ్లోబల్గా మలేరియా మరణాల్లో 95 శాతం 31 దేశాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా నైజీరియాలో 23 శాతం మంది ఈ రోగం బారిన పడి మరణించారు.