ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

ప్రపంచవ్యాప్తంగా అత్యంత తీవ్రమైన ఎమర్జెన్సీ ప్రకటించిన WHO

ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ లక్షల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1.6 కోట్లు దాటడంతో ప్రపంచవ్యాప్తంగా కరోనా పరిస్థితులపై అత్యంత తీవ్ర ఎమర్జెన్సీ ప్రకటించింది.

కరోనా విషయంలో WHO ఈ స్థాయి ప్రకటన చేయడం అత్యంత అరుదైన విషయం. ఇప్పటివరకు ఇది ఆరోసారి మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా కేవలం 4 రోజుల్లో 10 లక్షలు కేసులు వచ్చాయని, అమెరికా, భారత్, బ్రెజిల్ వంటి దేశాల్లో రోజుకు వేల సంఖ్యలో కొత్త కేసులు వస్తుండడం ఆందోళన కలిగించే అంశమని WHO తెలిపింది.

కరోనా కేసుల సంఖ్య ఆరు వారాల్లోనే రెట్టింపు కావడం కరోనా వైరస్ ఎంతగా వ్యాపిస్తోందో తెలియజేస్తుందన్నారు WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్. స్పెయిన్, బెల్జియం, హాంకాంగ్ వంటి దేశాల్లో కరోనా మళ్లీ విజృంభిస్తోందని, ఇప్పుడక్కడ సెకండ్ వేవ్ కనిపిస్తోందని తెలిపారు. అయితే మరణాల సంఖ్య మాత్రం వారానికి 30 వేల నుంచి 40 వేల వరకు నమోదవుతుండడంలో పెద్దగా మార్పేమీ లేదని చెప్పారు.