హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ను భారత ఎన్నికల కమిషన్ స్టేట్ అడిషనల్ సీఈవోగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ట్రాన్స్ఫర్ తప్పనిసరి కానుంది. బదిలీకి సంబంధించి నేడో, రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎక్కువ కాలం కమిషనర్గా లోకేశ్ కుమార్ రికార్డు స్థాయిలో కొనసాగారు. 2019 ఆగస్టు 29న బాధ్యతలు చేపట్టిన ఆయన మూడేండ్ల 10 నెలలు కొనసాగారు.
ఆయన ట్రాన్స్ఫర్ నేపథ్యంలో బల్దియా బాస్ ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కమిషనర్గా పనిచేసిన దానకిశోర్, అడిషనల్ కమిషనర్గా పనిచేసిన రొనాల్డ్ రాస్తో పాటు రఘునందన్ రావు, రాహుల్ బొజ్జా పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.