బల్దియా కొత్త బాస్ ​ఎవరు.. పరిశీలనలో నలుగురు ఐఏఎస్​ల పేర్లు

బల్దియా కొత్త బాస్ ​ఎవరు.. పరిశీలనలో నలుగురు ఐఏఎస్​ల పేర్లు

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్​ను భారత ఎన్నికల కమిషన్ స్టేట్ అడిషనల్ సీఈవోగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ట్రాన్స్​ఫర్ తప్పనిసరి కానుంది. బదిలీకి సంబంధించి నేడో, రేపో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. జీహెచ్ఎంసీ చరిత్రలో ఎక్కువ కాలం కమిషనర్​గా లోకేశ్ కుమార్ రికార్డు స్థాయిలో కొనసాగారు.  2019 ఆగస్టు 29న బాధ్యతలు చేపట్టిన ఆయన మూడేండ్ల 10 నెలలు కొనసాగారు. 

ఆయన ట్రాన్స్​ఫర్​ నేపథ్యంలో బల్దియా బాస్ ఎవరనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదివరకు కమిషనర్​గా పనిచేసిన దానకిశోర్, అడిషనల్ కమిషనర్​గా పనిచేసిన రొనాల్డ్ రాస్​తో పాటు  రఘునందన్ రావు, రాహుల్ బొజ్జా పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.