Ntr: ఎన్టీఆర్కి జోడీ కుదరడం లేదా.. ఫైనల్గా ఎవరు ఉంటారో!

Ntr: ఎన్టీఆర్కి జోడీ కుదరడం లేదా.. ఫైనల్గా ఎవరు ఉంటారో!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ కొరటాల శివతో దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవరపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే.. సెప్టెంబర్ 27 కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇదిలా ఉంటే.. దేవర తరువాత ఎన్టీఆర్ కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న సినిమాలో హీరోయిన్ గా ఎవరు చేయనున్నారు అనే విషయం గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ గా మారింది. 

అదేంటంటే.. ఎన్టీఆర్ 31 మూవీ కోసం ఇద్దరు హీరోయిన్స్ ను అనుకుంటున్నారట మేకర్స్. అందులో బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఒకరు మాత్రమే ఈ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉందని టాక్. కానీ, ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం రష్మిక మందన్నాను ఆల్మోస్ట్ ఫిక్స్ చేశారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుందట. దీంతో.. రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఎన్టీఆర్, రష్మిక జోడీ ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.