మా టీవీలో టెలికాస్ట్ అయ్యే సీరియల్స్ మధ్య జరిగే పోటీ స్టార్మా పరివార్లీగ్. ఇందులో టైటిల్ కోసం ఒక సీరియల్ నటీనటులు, మరో సీరియల్ వాళ్లతో పోటీపడతారు. ఇప్పటికే రెండు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్తో ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేస్తోంది. అయితే ఈ సీజన్ గ్రాండ్ ఫినాలె ఈ ఆదివారం మధ్యాహ్నం1.30 నిమిషాలకు టెలికాస్ట్ కానుంది. ‘జానకి కలగనలేదు, దేవత’ సీరియల్స్ టైటిల్ కోసం పోటీపడనున్నాయి. ఫైనల్ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని రీసెంట్గా రిలీజ్ చేసింది స్టార్ మా. యాంకర్ ఝాన్సీ హోస్ట్ చేస్తున్న ఈ షో గ్రాండ్ ఫినాలెలో హీరోయిన్ రాశి స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయనుంది. ప్రోమోలో అమర్దీప్, అర్జున్ అంబటి కామెడీ ఆకట్టుకుంది. టైటిల్ విన్నర్ తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
త్వరలోనే ‘ఝలక్ దిఖ్ లాజా
హిందీ రియాలిటీ షోలలో ‘ఝలక్ దిఖ్ లాజా’ ఓ ట్రెండ్ సెట్టరనే చెప్పొచ్చు. ఈ షో తర్వాత అన్ని భాషల్లో సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోలకి క్రేజ్ పెరిగింది. 2006 లో మొదలైన ఈ షో ఇప్పటికే పది సీజన్లు పూర్తి చేసుకుంది. వాటిల్లో తొమ్మిది సీజన్స్ మంచి టీఆర్పీతో నడిచాయి.. కానీ, 2016– 17 మధ్యలో టెలికాస్ట్ అయిన పదో సీజన్ ఆడియెన్స్ని ఎంటర్టైన్ చేయలేకపోయింది. దాంతో ఈ షోని ‘డాన్స్ దివానీ’ అనే మరో డాన్స్ షోతో రీప్లేస్ చేసింది ఛానెల్. కానీ, ఇప్పుడు పదకొండో సీజన్ని అనౌన్స్ చేసింది కలర్స్ ఛానెల్. ఇప్పటికే ప్రి– ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ షోలో దివ్యాంకా త్రిపాఠి, మోషిన్ ఖాన్, శ్రద్ధా ఆర్య, సింబ నాగ్పాల్, దివ్య అగర్వాల్, కృష్ణ కౌల్.. లాంటి బీటౌన్ ఫేమస్ సెలబ్రిటీలు పార్టిసిపేట్ చేయనున్నట్టు టాక్.
స్కూల్లో కాపీ కొట్టా
ఓటీటీ ప్లాట్ఫామ్ ‘ఆహా’ లో టెలికాస్ట్ అవుతున్న రియాలిటీ షో సర్కార్–2. ప్రదీప్ హోస్ట్ చేస్తున్న ఈ షోకి హీరోయిన్ సాయిపల్లవి, హీరో రానా, నవీన్ చంద్ర, డైరక్టర్ వేణు ఊడుగుల ఈ వారం పార్టిసిపెంట్స్గా వస్తున్నారు. ఈ స్పెషల్ ఎపిసోడ్లో తనకి వంట చేయడం రాదని...ఒకవేళ ఏదైనా వండినా తను మాత్రమే తినగలనని చెప్పింది సాయిపల్లవి. అలాగే స్కూల్లోఎగ్జామ్స్లో కాపీ కొట్టానని కూడా చెప్పింది. ఆమె అలా అన్న వెంటనే ‘‘కాపీ కొట్టడం తప్పు అని కాలేజీకి వెళ్లడం మానేశా’’ అన్నాడు రానా. ప్రదీప్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ కోసం ఫోన్ కాల్ ఆప్షన్ని ఎంచుకొని హీరో వెంకటేష్కి ఫోన్ చేశాడు రానా. ఈ స్పెషల్ ఎపిసోడ్ ఈ శుక్రవారం టెలికాస్ట్ కానుంది.
ఈ నెల 13 నుంచి... కొత్త సీరియల్
జీ తెలుగులో మరో కొత్త సీరియల్ రాబోతోంది. ‘కోడళ్ళు మీకు జోహార్లు’ టైటిల్తో ఈ నెల 13 నుంచి మధ్యాహ్నం 3 గంటలకు టెలికాస్ట్ కానుంది ఈ సీరియల్. కథ విషయానికొస్తే.. పేరుకు తగ్గట్టే అత్తాకోడళ్ల బ్యాక్ డ్రాప్లో నడుస్తుంది. తల్లీకొడుకుల బంధం బీటలు వారేది కోడలు ఎంట్రీ ఇచ్చాకే అనుకుంటుంది అత్త. అందుకే కోడల్ని గుప్పెట్లో పెట్టుకోమని అత్తల సంఘం పెట్టి అందరికీ చెప్తుంటుంది. కానీ, కోడలు మాత్రం అత్త, కోడళ్లు కలిస్తేనే బంగారుకుటుంబం అవుతుందని నమ్ముతుంది. ఈ సీరియల్లో కన్నడ టెలివిజన్ ఫేమ్ దుర్గా శ్రీ, కౌస్తుభమణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్లకి జోడిగా కన్నడ టెలివిజన్ హీరో నాగార్జున్, వదినమ్మ సీరియల్ ఫేమ్ చరణ్ రాజ్లు నటిస్తున్నారు. పవిత్ర రాజ్ పవర్ఫుల్ అత్త క్యారెక్టర్లో కనిపించనుంది. ప్రముఖ టెలివిజన్ యాక్ట్రెస్ రాగిణి కూడా ఈ సీరియల్లో నటిస్తోంది.ఈ టైమ్ స్లాట్లో ఇప్పటివరకు టెలికాస్ట్ అవుతున్న ‘వైదేహి పరిణయం’ సీరియల్ ఈ నెల13 నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటలకి టెలికాస్ట్ అవుతుంది.