గ్రాండ్​ ఫినాలె గెలిచేదెవరు?

గ్రాండ్​ ఫినాలె గెలిచేదెవరు?

మా టీవీలో టెలికాస్ట్​ అయ్యే సీరియల్స్​ మధ్య జరిగే పోటీ స్టార్​మా పరివార్​లీగ్​. ఇందులో టైటిల్​ కోసం ఒక సీరియల్​ నటీనటులు, మరో సీరియల్​ వాళ్లతో పోటీపడతారు. ఇప్పటికే రెండు సీజన్స్​ పూర్తి​ చేసుకున్న ఈ షో ప్రస్తుతం మూడో సీజన్​తో ఆడియెన్స్​ని ఎంటర్​టైన్​ చేస్తోంది. అయితే ఈ సీజన్​ గ్రాండ్​ ఫినాలె ఈ ఆదివారం మధ్యాహ్నం1.30 నిమిషాలకు టెలికాస్ట్​ కానుంది. ‘జానకి కలగనలేదు, దేవత’ సీరియల్స్​ టైటిల్​ కోసం పోటీపడనున్నాయి. ఫైనల్​ ఎపిసోడ్​కి సంబంధించిన ప్రోమోని రీసెంట్​గా రిలీజ్​ చేసింది స్టార్​ మా. యాంకర్​ ఝాన్సీ హోస్ట్​ చేస్తున్న ఈ షో గ్రాండ్​ ఫినాలెలో హీరోయిన్​ రాశి స్పెషల్​ పెర్ఫార్మెన్స్​ చేయనుంది. ప్రోమోలో అమర్​దీప్​, అర్జున్​ అంబటి కామెడీ ఆకట్టుకుంది. టైటిల్​ విన్నర్​ తెలియాలంటే ఈ ఆదివారం వరకు వేచి చూడాల్సిందే. 

త్వరలోనే ‘ఝలక్​ దిఖ్​ లాజా

హిందీ రియాలిటీ షోలలో ‘ఝలక్​ దిఖ్​ లాజా​’ ఓ ట్రెండ్​ సెట్టరనే చెప్పొచ్చు. ఈ షో తర్వాత అన్ని భాషల్లో సెలబ్రిటీ డాన్స్​ రియాలిటీ షోలకి క్రేజ్​ పెరిగింది. 2006 లో మొదలైన ఈ షో ఇప్పటికే పది సీజన్లు​ పూర్తి చేసుకుంది. వాటిల్లో తొమ్మిది సీజన్స్​ మంచి టీఆర్పీతో నడిచాయి.. కానీ, 2016– 17 మధ్యలో టెలికాస్ట్​ అయిన పదో సీజన్​ ఆడియెన్స్​ని ఎంటర్​టైన్​ చేయలేకపోయింది. దాంతో​ ఈ షోని​ ‘డాన్స్​ ​ దివానీ’  అనే మరో డాన్స్​ షోతో రీప్లేస్​ చేసింది ఛానెల్. కానీ, ఇప్పుడు పదకొండో సీజన్​ని అనౌన్స్​ చేసింది కలర్స్​ ఛానెల్​. ఇప్పటికే ప్రి– ప్రొడక్షన్​ పనులు పూర్తి చేసుకున్న ఈ షోలో దివ్యాంకా త్రిపాఠి,  మోషిన్​ ఖాన్​, శ్రద్ధా ఆర్య, సింబ నాగ్​పాల్​, దివ్య అగర్వాల్, కృష్ణ కౌల్​.. లాంటి బీటౌన్​ ఫేమస్​ సెలబ్రిటీలు పార్టిసిపేట్​ చేయనున్నట్టు టాక్​. 

స్కూల్లో కాపీ కొట్టా

ఓటీటీ ప్లాట్​ఫామ్​ ‘ఆహా’ లో టెలికాస్ట్​ అవుతున్న రియాలిటీ షో సర్కార్–2​. ప్రదీప్​ హోస్ట్​ చేస్తున్న ఈ  షోకి హీరోయిన్​ సాయిపల్లవి, హీరో రానా, నవీన్​ చంద్ర,  డైరక్టర్​ వేణు ఊడుగుల  ఈ వారం పార్టిసిపెంట్స్​గా వస్తున్నారు. ఈ స్పెషల్​ ఎపిసోడ్​లో తనకి వంట చేయడం రాదని...ఒకవేళ ఏదైనా వండినా తను మాత్రమే తినగలనని చెప్పింది సాయిపల్లవి. అలాగే స్కూల్లో​ఎగ్జామ్స్​లో కాపీ కొట్టానని కూడా చెప్పింది. ఆమె అలా అన్న వెంటనే ‘‘కాపీ కొట్టడం తప్పు అని కాలేజీకి వెళ్లడం మానేశా’’ అన్నాడు రానా. ప్రదీప్​ అడిగిన ప్రశ్నకి ఆన్సర్​ కోసం ఫోన్ కాల్​ ఆప్షన్​ని ఎంచుకొని హీరో వెంకటేష్​కి ఫోన్​ చేశాడు రానా. ఈ స్పెషల్​ ఎపిసోడ్​ ఈ శుక్రవారం టెలికాస్ట్ కానుంది. 

ఈ నెల 13 నుంచి... కొత్త సీరియల్ 

జీ తెలుగులో మరో కొత్త సీరియల్​ రాబోతోంది. ‘కోడళ్ళు మీకు జోహార్లు’ టైటిల్​తో ఈ నెల 13 నుంచి   మధ్యాహ్నం 3 గంటలకు టెలికాస్ట్​ కానుంది ఈ సీరియల్​. కథ విషయానికొస్తే.. పేరుకు తగ్గట్టే అత్తాకోడళ్ల బ్యాక్​ డ్రాప్​లో నడుస్తుంది. తల్లీకొడుకుల బంధం బీటలు వారేది కోడలు ఎంట్రీ ఇచ్చాకే అనుకుంటుంది అత్త. అందుకే కోడల్ని గుప్పెట్లో పెట్టుకోమని అత్తల సంఘం పెట్టి అందరికీ చెప్తుంటుంది. కానీ, కోడలు మాత్రం అత్త, కోడళ్లు కలిస్తేనే బంగారుకుటుంబం అవుతుందని  నమ్ముతుంది. ఈ సీరియల్​లో కన్నడ టెలివిజన్​ ఫేమ్​ దుర్గా శ్రీ, కౌస్తుభమణి హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాళ్లకి జోడిగా కన్నడ టెలివిజన్​ హీరో నాగార్జున్​, వదినమ్మ సీరియల్​ ఫేమ్​ చరణ్​ రాజ్​లు నటిస్తున్నారు. పవిత్ర రాజ్​ పవర్​ఫుల్​ అత్త క్యారెక్టర్​లో కనిపించనుంది. ప్రముఖ టెలివిజన్​ యాక్ట్రెస్​ రాగిణి కూడా ఈ సీరియల్​లో నటిస్తోంది.ఈ టైమ్​ స్లాట్​లో ఇప్పటివరకు టెలికాస్ట్​ అవుతున్న ‘వైదేహి పరిణయం’ సీరియల్ ఈ నెల​13 నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటలకి టెలికాస్ట్​ అవుతుంది.