చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్తో తాను భేటీకావడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఒక ఫ్రెండ్గా స్టాలిన్ ను కలిశానని ఆయన చెప్పారు. ఆదివారం చెన్నైలో పోయెస్ గార్డెన్లోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడారు. స్టాలిన్ను తాను కలిసినప్పటి నుంచి అనేక వదంతులు, విమర్శలు వస్తున్నాయని చెప్పారు.
విజయ్ సీఎం కావడంతో తాను అసూయ పడుతున్నట్లు పుకార్లు వచ్చాయని, అవన్నీ అర్థంలేని వార్తలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టానని, ఇప్పటికీ ఆ పుకార్లపై స్పందించకపోతే వాటిని జనం నిజమని భావిస్తారేమోనని తెలిపారు. ఒకవేళ, విజయ్ కాకుం డా కమల్ హాసన్ సీఎం అయుంటే కచ్చితంగా అసూయపడేవాడినని సరదాగా అన్నారు.
