
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా సాగుతోంది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(143 నాటౌట్), రోహిత్ శర్మ(103) ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో రెండో రోజు ఆట ముగిసేసమయానికి భారత జట్టు 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.
కెరీర్లో తొలి టెస్ట్ ఆడుతోన్న ఆడుతున్న జైస్వాల్ శతకం బాదేసి వహ్వా అనిపించగా.. అటు కెప్టెన్ రోహిత్ శర్మ (103) కూడా చాలా రోజుల తర్వాత బ్యాట్కు పనిచెబుతూ శతకం సాధించాడు. అనంతరం సెంచరీ పూర్తియిన కాసేపటికే రోహిత్ వెనుదిరగ్గా.. వన్ డౌన్లో వచ్చిన శుభ్మాన్ గిల్ 6 పరుగులకే వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ.. మునపటి లయ అందుకోవడానికి నానా అవస్థలు పడ్డాడు. తొలి బౌండరీ సాధించేందుకు ఏకంగా 81 బంతులు తీసుకున్నాడు.
అయితే, ఒకానొక సమయంలో కోహ్లీ.. విండీస్ కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్వైట్ బౌలింగ్పై అసహనం వ్యక్తం చేశాడు. బ్రాత్వైట్ ఇటుకలు విసిరేసినట్లు బౌలింగ్ చేస్తున్నాడని యశస్వి జైస్వాల్తో చెప్పాడు. ఆ వ్యాఖ్యలు స్టంప్ మైక్లో వినిపించినట్లు కథనాలు వస్తున్నాయి.
కోహ్లీ.. బ్రాత్వైట్ బౌలింగ్ను ఉద్దేశిస్తూ 'Bhatta phenk raha hai' అని జైస్వాల్తో హిందీలో మాట్లాడిన మాటలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. అయితే, బ్రాత్వైట్ బౌలింగ్ శైలిపై అనుమానాలు తలెత్తడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ అతనిపై ఇలాంటి విమర్శలు వచ్చాయి. అయితే, ఐసీసీ మాత్రం ఈ ఆరోపణలను కొట్టి పడేస్తోంది. బ్రాత్వైట్ బౌలింగ్ యాక్షన్లో ఎలాంటి తప్పేం లేదని, నిబంధనలకు అనుగుణంగానే అతను బౌలింగ్ చేస్తున్నాడని స్పష్టం చేసింది.