సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. హత్నూర మండలంలోని కొన్యాల గ్రామంలో పొలంలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి.
కొన్యాల గ్రామానికి చెందిన రైతు పత్తి మల్లేశం యాదవ్ (33), భార్య నరసమ్మ(25) ఈ సాయంత్రం పొలానికి వెళ్లారు. ఐతే.. అప్పటికే తెగిపడిన కరెంట్ తీగల కారణంగా.. వారికి షాక్ తగిలింది. దీంతో.. పొలంలోనే ఇద్దరు దంపతులు ప్రాణాలు కోల్పోయారు. వారి తోలుకొచ్చిన రెండు ఎడ్లు కూడా కరెంట్ వైర్లకు తగిలి షాక్ తో మృతి చెందాయి.
ఎడ్లను పొలానికి కొట్టుకుంటూ వచ్చిన రైతు చేతిలో ముల్లుగర్ర అలాగే ఉంది. కరెంట్ షాక్ తో రైతులైన భార్యాభర్తలు చనిపోవడం, పశువులు మృతి చెందడం స్థానికులను కంటతడిపెట్టించింది.