లాక్‌డౌన్ ఎఫెక్ట్: భర్త అంత్యక్రియలకు రాలేకపోయిన భార్య

లాక్‌డౌన్ ఎఫెక్ట్: భర్త అంత్యక్రియలకు రాలేకపోయిన భార్య

ఇబ్రహీంపట్నం: లాక్‌డౌన్ కార‌ణంగా ఓ మ‌హిళ‌కు త‌న భ‌ర్త‌ను క‌డ‌సారి చూసే అవ‌కాశం కూడా లేకుండా పోయింది . విదేశాల్లో కూతురి వ‌ద్ద ఉండ‌డం వ‌ల్ల భ‌ర్త అంత్య‌క్రియ‌ల‌కు రాలేక‌పోయింది

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో రిటైర్డ్ టీచ‌ర్ జిట్టా మాధవరెడ్డి మూడు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడికి నలుగురు కుమార్తెలుండగా వారికి పెళ్లిళ్లు చేశారు. వారిలో అమెరికాలో ఉన్న కుమార్తె వద్దకు అత‌ని భార్య వెళ్ళింది. అయితే ఈ ఏడాది మార్చి 24 న కరోన వైర‌స్ కార‌ణంగా లాక్ డౌన్ ప్ర‌క‌టించ‌డంతో ఆమె అక్కడే చిక్కుకు పోయింది. కొన్ని రోజుల్లోనే తిరిగి రావాల్సిన భార్య అమెరికాలోనే ఉండిపోవడంతో మాధవరెడ్డి రెండు నెల‌లుగా ఒంట‌రిగా ఉంటున్నాడు. ఆమెపై బెంగతో ఆదివారంతో గుండెపోటుతో కన్నుమూశాడు

లాక్ డౌన్ కారణంగా ఆమె అమెరికా నుంచి వచ్చే అవకాశం లేకపోవడంతో ఆదివారం మాధ‌వ‌రెడ్డి అంత్యక్రియలు పూర్తిచేశారు. 50 ఏండ్లు కలిసి బ్రతికిన భర్త యొక్క‌ అంత్యక్రియలకు భార్య‌ను ఈ కరోన మహమ్మారి దూరం చేసింది. కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది.