అనాథలైన ఇద్దరు ఆడ పిల్లలు
జవహర్నగర్, వెలుగు: భర్త మృతిని తట్టుకోలేక భార్య సూసైడ్ చేసుకున్న ఘటన హైదరాబాద్లోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్పరిధిలో జరిగింది. దమ్మాయిగూడ ద్వారకాపురిలోని స్ఫూర్తి ఎన్క్లేవ్లో ఉండే సుబ్రహ్మణ్యం, అరుణ హర్షిత(35) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కూతుళ్లు. సుబ్రహ్మణ్యం క్యాటరింగ్పని చేస్తుంటాడు. ఇటీవల కరోనా సోకింది. హాస్పిటల్లో చికిత్స పొందుతూ 15 రోజుల క్రితం మృతి చెందాడు. అప్పటి నుంచి అరుణహర్షిత బాధపడుతూ ఉంది. పిల్లలను చూసుకోవడానికి ఇబ్బందులు పడుతూ గురువారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. శుక్రవారం ఉదయం గమనించిన అత్త పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి డెడ్బాడీని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్కి తరలించారు. మృతురాలికి బంధువులు ఎవరూ లేకపోవడం, అత్తకు కరోనా ఉండడంతో ఉస్మానియాలోని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులే అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనాతో కొడుకు.. గుండెపోటుతో తల్లి
ములకలపల్లి: కరోనాతో చికిత్స పొందుతున్న కొడుకు చనిపోయాడని తెలిసిన కొద్దిసేపటికే ఇంటి వద్ద ఉన్న తల్లి గుండెపోటుతో మృతి చెందింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం రాజుపేటలో జరిగింది. గ్రామానికి చెందిన లక్ష్మమ్మ(75) కొడుకు కళ్యాణ్రావు(45). 16 రోజుల క్రితం కళ్యాణ్కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్అని తేలింది. ఇటీవల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్లోని ఓ ప్రైవేట్హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ఆ విషయం తెలుసుకున్న లక్ష్మమ్మ గుండెపోటుతో చనిపోయింది.