
జనగామ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి గ్రామంలోకి ఉదయం ఎలుగు వచ్చింది. ఊర్లోకి వచ్చిన ఎలుగుబంటిని కర్రలతో అటవీ ప్రాంతానికి తరిమికొట్టారు స్థానికులు. ఉదయాన్నే ఊళ్లోకి ఎలుగు బంటి రావడంతో రైతులు భయాందోళనలకు గురయ్యారు.