జనగామలో ఎలుగుబంటి హల్ చల్..పరుగులు తీసిన జనం

జనగామలో ఎలుగుబంటి హల్ చల్..పరుగులు తీసిన జనం

జనగామ జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది. రఘునాథపల్లి మండలం గోవర్థనగిరి గ్రామంలోకి ఉదయం ఎలుగు వచ్చింది. ఊర్లోకి వచ్చిన ఎలుగుబంటిని కర్రలతో అటవీ ప్రాంతానికి తరిమికొట్టారు స్థానికులు. ఉదయాన్నే ఊళ్లోకి ఎలుగు బంటి రావడంతో రైతులు భయాందోళనలకు గురయ్యారు.