రాజన్నసిరిసిల్ల, వెలుగు: కాంగ్రెస్ పై, సీఎం రేవంత్ రెడ్డిపై నమ్మకం ఉంది కాబట్టే జూబ్లీహిల్స్ ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని గెలిపించారని కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే.మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియాలో విష ప్రచారం చేశారని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెఫరెండమని అన్నారని.. ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పకుంటారా అని ప్రశ్నించారు. కేసీఆర్ లేకపోతే నీ స్థాయి ఏంటని, ఇకనైనా అహంకారం తగ్గించుకోవాలని సూచించారు.
కాంగ్రెస్పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మాజీ కౌన్సిలర్లు రెడ్డి నాయక్, వేముల రవి పాల్గొన్నారు.
