రాహుల్ డూప్ వివరాలు త్వరలో బయటపెడతా :  సీఎం హిమంత 

రాహుల్ డూప్ వివరాలు త్వరలో బయటపెడతా :  సీఎం హిమంత 

గువాహటి: అస్సాంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ ఉపయోగించిన డూప్ వివరాలను త్వరలోనే బయటపెడతానని ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వశర్మ అన్నారు. రాహుల్ డూప్ పేరు, అడ్రస్  తెలియజేస్తానని తెలిపారు.  శనివారం సోనిట్​పుర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.“నేను మాటల మనిషిని కాను,  రాహుల్​ డూప్​ను రూపొందించిన విధానం, పేరు వంటి వివరాలన్నీ త్వరలో బయటపెడతా. దీనికి కొంచెం సమయం పడుతుంది. ఇయ్యాల ముఖ్యమైన పని మీద నేను దిబ్రూగఢ్ వెళ్తున్నాను. రేపు గువాహటి వెళ్లాల్సి ఉంది. తిరిగి వచ్చాక అన్ని వివరాలు  బయటపెడతా” అని హిమంత చెప్పారు.