- డీజిల్ఎగుమతిపై లీటరుకు 50 పైసలు వెంటనే అమలులోకి
న్యూఢిల్లీ: డొమెస్టిక్ క్రూడాయిల్పై విండ్ఫాల్ ట్యాక్స్ను జీరో చేశారు. టన్ను క్రూడాయిల్పై ఇప్పటిదాకా రూ. 3,500 చొప్పున విండ్ ఫాల్ ట్యాక్స్ విధిస్తున్నారు. అంతేకాదు, డీజిల్ ఎక్స్పోర్ట్పై విండ్ ఫాల్ ట్యాక్స్నూ లీటరుకు 50 పైసలుకి అంటే సగానికి తగ్గించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయెల్ (ఏటీఎఫ్), పెట్రోల్ల ఎగుమతులపై విండ్ఫాల్ ట్యాక్స్ను గతంలోనే జీరో లెవెల్కు తెచ్చారు. తాజాగా వాటిలో ఎలాంటి మార్పులూ చేయలేదు. విండ్ఫాల్ ట్యాక్స్ మార్పులతో మంగళవారం నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది.
కిందటేడాది జులై 1 నుంచి ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఎనర్జీ కంపెనీలకు వచ్చే సూపర్ నార్మల్ ప్రాఫిట్స్పై పన్ను వేసిన ఇతర దేశాల జాబితాలో ఇండియా కూడా చేరింది. అప్పట్లో పెట్రోలు, ఏటీఎఫ్లపై లీటరుకు రూ. 6 చొప్పున, డీజిల్పై లీటరుకు రూ. 13 చొప్పున విండ్ ఫాల్ ట్యాక్స్ను అమలులోకి తెచ్చారు. మరోవైపు డొమెస్టిక్ క్రూడ్ ప్రొడక్షన్పైనా టన్నుకు రూ. 23,250 చొప్పున విండ్ఫాల్ ట్యాక్స్ విధించడం మొదలు పెట్టారు.
గ్లోబల్ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ రేట్ల కదలికల ఆధారంగా విండ్ ఫాల్ ట్యాక్స్రేట్లను ప్రతీ పదిహేను రోజులకి ఒకసారి అప్పటి నుంచి రివ్యూ చేసి, తగిన మార్పులు చేస్తున్నారు. జామ్నగర్లో రిఫైనరీ కాంప్లెక్స్ నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్), రాస్నెఫ్ట్ సపోర్టుతో నడుస్తున్న నయారా ఎనర్జీ కంపెనీలు...రెండూ మన దేశం నుంచి ప్రధానంగా పెట్రోలియం ప్రొడక్టులను ఎగుమతి చేస్తున్నాయి.
