హైదరాబాద్, వెలుగు: ఆకాశంలో అద్భుత విన్యాసాల కు, వివిధ రకాల విమానాల ప్రదర్శనకు బేగంపేట ఎయిర్పోర్టు మరోసారి వేదికైంది. ‘వింగ్స్ ఇండియా–2024’ ఏవియేషన్ షో గురువారం ప్రారంభమైంది. రెండేండ్లకు ఒకసారి జరిగే ఈ ఎగ్జిబిషన్ను కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రారంభించారు. మినిస్ట్రీ ఆఫ్సివిల్ ఏవియేషన్, ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా, ఫెడరేషన్ ఆఫ్ఇండియన్ చాంబర్ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ షో జరగనుంది. 106 దేశాల నుంచి 1,500 మంది ప్రతినిధులు, 5 వేల మంది బిజినెస్ విజిటర్స్, వివిధ దేశాల నుంచి లక్ష మంది సందర్శకులు, ప్రపంచవ్యాప్తంగా200 మంది ఎగ్జిబిటర్లు ఇందులో పాల్గొంటున్నారు. చార్టెడ్ ఫ్లైట్లు, హెలికాప్టర్లు, 21 రకాల విమానాలు ప్రదర్శనలో ఉన్నాయి.
రెండ్రోజులు సందర్శకులకు చాన్స్..
ఈ ఏవియేషన్ షోలో మొదటి రెండ్రోజులు వ్యాపార వేత్తలు, దేశవిదేశాల ప్రతినిధులు పాల్గొంటారు. మిగ తా రెండ్రోజులు (శని, ఆది) సాధారణ ప్రజలను అనుమ తిస్తారు. బుక్మైషో ద్వారా రూ.750 పెట్టి, టికెట్బుక్చేసుకోవాల్సి ఉంటుంది. మూడేండ్లు పైబడినోళ్లందరూ టికెట్ తీసుకోవాలి. ఉదయం 10 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు సందర్శకులను అనుమతిస్తారు. అయితే 30 అడుగుల దూరం నుంచి మాత్రమే విమానాలకు చూసేందుకు వీలుంటుంది. సికింద్రాబాద్లోని బైసన్ పోలో గ్రౌండ్స్, ఎస్పీ రోడ్లోని వెస్లీ బాయ్స్హాస్టల్ గ్రౌండ్ లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. పార్కింగ్ఏరియా నుంచి ఎయిర్పోర్టుకు ఫ్రీగా షటిల్బస్సులు నడుపుతారు.
ప్రతిరోజూ విన్యాసాలు..
ఈ షోలో భాగంగా ఇండియన్ ఎయిర్ఫోర్స్ కు చెందిన సారంగ టీమ్ ప్రతిరోజూ సాయంత్రం 4:15 గంటల నుంచి 5 గంటల దాకా విన్యాసాలు చేస్తుంది. అలాగే దేశవిదేశాలకు చెందిన 21 విమానాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద విమానమైన బోయింగ్777 ఎక్స్ను దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్పోర్టులో ప్రదర్శిస్తున్నారు.