26 శాతం పెరిగిన విప్రో లాభం..  నాలుగో క్వార్టర్​లో రూ. 3,569.6 కోట్లు 

26 శాతం పెరిగిన విప్రో లాభం..  నాలుగో క్వార్టర్​లో రూ. 3,569.6 కోట్లు 

న్యూఢిల్లీ:  ఐటీ కంపెనీ విప్రో కన్సాలిడేటెడ్​ ప్రాఫిట్​ మార్చి క్వార్టర్​లో ఏడాది లెక్కన 25.9 శాతం పెరిగి రూ. 3,569.6 కోట్లకు చేరుకుంది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీకి రూ. 2,834.6 కోట్ల లాభం వచ్చింది. 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్​లో రూ. 22,504.2 కోట్ల ఆదాయం వచ్చింది. 2024 నాలుగో క్వార్టర్​లో ఆదాయం రూ. 22,208.3 కోట్లతో పోలిస్తే ఇది 1.33 శాతం పెరిగింది. సీక్వెన్షియల్​గా లాభం,  ఆదాయం వరుసగా 6.43 శాతం  0.83 శాతం పెరిగాయి. 

2025 ఆర్థిక సంవత్సరం పూర్తి సంవత్సరానికి లాభాలు 18.9 శాతం పెరిగి రూ. 13,135.4 కోట్లకు చేరుకున్నాయని విప్రో రెగ్యులేటరీ ఫైలింగ్​లో తెలిపింది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్​లో సంస్థ తన ఐటీ సేవల వ్యాపారం నుంచి వచ్చే ఆదాయం  2,505 మిలియన్ డాలర్ల నుంచి  2,557 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. 

సీక్వెన్షియల్​ ప్రాతిపదికన నిలకడైన  కరెన్సీలో ఇది  1.5–-3.5 శాతం తగ్గింది. స్థూల ఆర్థిక అనిశ్చితి వల్ల క్లయింట్లు జాగ్రత్తగా ఉన్నారని విప్రో సీఈఓ శ్రీని పల్లియా అన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో రెండు మెగా డీల్స్​సాధించామని, భారీ డీల్స్​ పెరిగాయని అన్నారు.