వైరింగ్ రెగ్యులేషన్లు అమలు చేయాలి..అలా చేయకనే విద్యుత్ ప్రమాదాలు: ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్

వైరింగ్ రెగ్యులేషన్లు అమలు చేయాలి..అలా చేయకనే విద్యుత్ ప్రమాదాలు: ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డబ్ల్యూఆర్1, డబ్ల్యూఆర్​2 (వైరింగ్ రెగ్యులేషన్స్) కఠినంగా అమలు చేయకపోవడంతోనే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల షార్ట్ సర్క్యూట్​లతో ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ నక్క యాదగిరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో షార్ట్ సర్క్యూట్ నివారణ చర్యలపై చర్చించారు.

వైరింగ్ రెగ్యులేషన్స్ అమలు చేయకపోవడం వల్లే విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నాయని యాదగిరి అన్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాల నివారణలో ఎలక్ట్రిషియన్ల పాత్ర కీలకమని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ఎలక్ట్రిషియన్లు, వైర్‌‌మెన్, సూపర్‌‌వైజర్‌‌లు తప్పనిసరిగా ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు ద్వారా వైర్‌‌మెన్, సూపర్‌‌వైజర్ పర్మిట్‌‌లు పొందాలని సూచించారు. ఈ పర్మిట్‌‌లు ఉన్నవారికి ప్రభుత్వం తరఫున 15 రోజుల ట్రైయినింగ్​ క్లాసులు నిర్వహించాలని కోరారు. ఇలాంటి ట్రెయినింగ్​లు విద్యుత్ ప్రమాదాల నివారణకు దోహదపడుతాయన్నారు.

ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఎలక్ట్రిషియన్లతోనే గృహాలు,వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల్లో కరెంట్​పనులు చేయించాలన్నారు. విద్యుత్ రంగంలో సురక్షిత పద్ధతులను పాటించడం, ఎలక్ట్రిషియన్లకు సరైన శిక్షణ, లైసెన్సింగ్‌‌ను ప్రోత్సహించడం వంటి చర్యలతో విద్యుత్ ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. మార్కెట్‌‌లో నాసిరకం కేబుల్స్, స్విచ్‌‌లు పెరుగుతున్నాయని, వాటి వినియోం ప్రమాదాలకు కారణమవుతోందని తెలిపారు. విద్యుత్​ కేబుళ్లు, స్విచ్‌‌ గేర్ కంపెనీలు క్వాలిటీ ప్రాడక్ట్​లు అందుబాటులోకి తేవాలన్నారు. ఎలక్ట్రిషియన్లకు సరైన టెక్నికల్​ పరిజ్ఞానం అందించాలని యాదగిరి సూచించారు. ఈ సమావేశంలో ఎలక్ట్రిషియన్​ అసోసియేషన్​ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేమాల బెనర్జీ, రాజు మహారాజు, సత్యనారాయణ, ఆర్. శ్రీనివాస్ నేత తదితరులు పాల్గొన్నారు.