మోడీ మెసేజ్తో నిద్రలేచాను

మోడీ మెసేజ్తో నిద్రలేచాను

భారత్ 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత ప్రజలకు వెస్టిండీస్ క్రికెటర్ గ్రిస్ గేల్ శుభాకాంక్షలు తెలిపాడు. భారత ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగతంగా తనకు మెసేజ్ పంపించినట్టు తెలిపాడు. మోడీ చేసిన మెసేజ్ తోనే తాను నిద్రలేచినట్టు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. 

‘‘73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రధాని మోడీ నుంచి వచ్చిన వ్యక్తిగత మెసేజ్ చూసి నిద్ర లేచాను. మోడీతో, భారత ప్రజలతో నాకు సన్నిహిత సంబంధాలు ఉండడం తెలిసిందే. యూనివర్స్ బాస్ నుంచి శుభాకాంక్షలు, ఎంతో ప్రేమతో’’ అంటూ గేల్ ట్వీట్ చేశాడు.