ఉడంగడ్డ రైల్వే ట్రాక్ పై మహిళ మృతదేహం…

ఉడంగడ్డ రైల్వే ట్రాక్ పై మహిళ మృతదేహం…

హైదరాబాద్:  రాజేంద్ర నగర్ నియోజక వర్గంలోని ఉడంగడ్డ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికింది. అటువైపుగా వెళ్తున్న జనాలు మైలార్ దేవ్ పల్లె పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ గుద్దుకుని మహిళ మృతి చెందినట్లుగా పోలీసులు బావిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసుకుని, రైల్వే పోలీసులకు మృతదేహాన్ని అప్పగించారు మైలార్ దేవ్ పల్లె పోలీసులు.